జనం న్యూస్ ఏప్రిల్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తెలంగాణ గ్రామ పంచాయితీ కార్మికుల యూనియన్ సీఐటీయూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ… మే ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో నాడు 18 గంటల పని విధానం నుండి 8 గంటలకు కార్మికులు పోరాడి సాధించుకున్న చరిత్ర వున్నదని అన్నారు, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారుల జేబులు నింపడానికి మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 100%విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మెస్రం సీతారాం, మరియు గ్రామ పంచాయితీ కార్మికులు, పుష్పా,పోషమ్మ, వెంకమ్మ, కవిత, పోశమ్మ శెట్టమ్మ, సుంకమ్మ ఇతరులు పాల్గొన్నారు.