కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బిఅర్ఎస్ పార్టీ కాగజ్ నగర్ మండల అధ్యక్షుడు
జనం న్యూస్ ఏప్రిల్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకాగజ్ నగర్ పట్టణ కేంద్రం కాపు వాడలోని ఎమ్మెల్సీ నివాసంలో బి ఆర్ ఎస్ పార్టీ కాగజ్ నగర్ మండల అధ్యక్షులు ఆవుల రాజ్ కుమార్,బరేగూడ తాజా మాజీ ఎంపీటీసీ వడై సంతోష్,బి ఆర్ ఎస్ యువ నాయకులు అమ్మా శ్రీకాంత్ నేడు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ దండే విఠల్ వల్లే సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అందుకే ఎమ్మెల్సీ గారు నియోజకవర్గంలో చేస్తున్న సంక్షేమంలో భాగం కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.అనంతరం ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ సిడం గణపతి,సిరిపురం సదశివ్ రాణా ప్రతాప్ సింగ్,శంకర్,అతాహాబేగ్,తదితరులు పాల్గొన్నారు.