జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ )
10వ తరగతి ఫలితాలలో మార్కుక్ మండలం నుండి 243 మందికి గాను 242 మంది పరీక్ష కు హాజరైనారు. ఇందులో 199 మంది విద్యార్థులు ఉత్తిర్నిత సాధించినారు.43 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.పాఠశాల ల వారిగా ఉత్తిర్ణత శాతము.కస్తూర్భా బాలికల విద్యాలయం 92 శాతం తో మండలం లో ప్రథమ స్థానం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెబిర్తి 82 శాతం, జిల్లా పరిషత్ దామారకుంట మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లు 80 శాతం తో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కుక్ 77 శాతం తో మొత్తం మండలం ఉతిర్నత శాతం 82 % కలదు.మార్కులు వారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి విద్యార్థి బి నాగచైతన్య రెడ్డి, 564 మార్కులు సాధించి మొదటి స్థానం లో, కస్తూరుభ విద్యాలయం విద్యార్థిని సి హెచ్ సరస్వతి 510 మార్కులు తో ద్వితీయ స్థానం పొందినది.