జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
తేది:28.04.2025 నాడు మద్యాహ్నం అందాద 2.30 గంటలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నందు పిర్యాది భర్త అయిన/ మృతుడు/ పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు, గ్రామం అప్పన్నపేట అనునతడిని దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్, వేల్పుల శైలజ లు కత్తితో పొడిచి చంపినారు అని పిర్యాదురాలు అయిన పొలం అనిత దరకాస్తు ఇవ్వగా అదే రోజు పెద్దపల్లి పోలిస్ స్టేషన్ నందు Cr.No.196/2025 U/sec 103(1) r/w 3(5) BNS క్రింద కేసు నమోదు చేయనైనది.
కేసు పూర్తి వివరములు: మృతుడు పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు, గ్రామం అప్పన్నపేట అనునతను ట్రాక్టర్ నడుపుకుంటూ జీవిస్తాడు. నేరస్తులు దొంగతుర్తి గ్రామానికి చెందిన భార్య భర్తలు 1) వేల్పుల సంతోష్, తండ్రి పేరు మొండయ్య వయసు 31 సంవత్సరాలు,కులం యాదవ్, 2) వేల్పుల శైలజ, భర్త పేరు సంతోష్ వయసు 28 సంవత్సరములు మృతునికి వరసకు సడ్డకుడు మరియు మరదలు అవుతారు. గత కొన్ని రోజులుగా మృతుడు మరియు శైలజ లు సన్నిహితంగా ఉండడంతో శైలజ ఫోన్ ద్వారా వారిరువురు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని గుర్తించిన సంతోష్ వారి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించి అతని భార్య శైలజ ను మందలించగా ఆమె అతనికి భయపడి కుమార్ తన వెంట పడుతున్నాడని తెలిపి అప్పటి నుండి మృతుడైన కుమార్ కు దూరంగా ఉంటున్నది. సంతోష్ తన భార్య జోలికి వస్తే భాగుందదని కుమార్ ను కుడా బెదిరించడం జరిగినది. ఈ క్రమంలో మృతుడు తనకు శైలజ కు మద్య సంబంధం ఉందని వారి బంధువులతో చేపుతున్నాడని మరియు అతను శైలజకు ఫోన్ చేస్తున్నాడని కోపం పెంచుకున్న నిందితులు అతడిని చంపితే గాని వారి సమస్యకు పరిష్కారం ఉండదని, లేకుంటే బంధువుల మద్య పరువు పోతుందని భావించినారు. అతడిని చంపడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంతోష్ కు నిన్న తేది:28-04-2025 నాడు ఉదయం అందాద 11 గంటలకు కుమార్ ఫోన్ చేయగా, అతనితో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కు రమ్మని చెప్పగా మృతుడు తన కారులో మద్యాహ్నం అందదా 1 గంటలకు అక్కడికి చేరుకున్నాడు. సంతోష్ తన భార్య శైలజకు ఫోన్ చేసి ఇట్టి విషయాన్ని ఆమెకు తెలిపి అక్కడ ఎలాగైనా కుమార్ ను చంపుదామని తెలపగా ఆమె దొంగతుర్తి నుండి బస్సు లో పెద్దపల్లి మజీద్ చౌరస్తా కు చేరుకోగా అప్పటికే వారి పథకం ప్రకారం పెద్దపల్లి జెండా చౌరస్తా దగ్గరలో కత్తిని కొన్న సంతోష్, బైక్ పై శైలజను ఎక్కించుకొని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్దకువచ్చి, మద్యహ్నం అందదా 2.30 గంటలకు సంతోష్ మృతుడైన కుమార్ తో గొడవపడి అతడిని చంపే ఉద్దేశంతో తను తెచ్చుకొన్న కత్తి తో కుమార్ మెడ పై మొదటగా పొడవగా, శైలజ అతడి చేయ్యిలను పట్టుకోగా సంతోష్ కత్తితో కుమార్ మేడపై, చాతిపై, మొకం పై పొడిచినాడు, అతను తప్పించుకునే క్రమంలో శైలజకు మరియు కత్తి పిడి వుడగా సంతోష్ లకు కూడా చేతికి గాయాలు అయినాయి.ఆతర్వాత సంతోష్ మృతుడైన కుమార్ ను క్రింద పడేసి పెన్ తో చాతిపై మరియు పొట్ట భాగంలో పోడిసినాడు.ఆతర్వాత సంతోష్, క్రింద పడి ఉన్న కుమార్ పొట్టపై, మేడపై కాళ్ళు పెట్టి నిల్చొని ఉండగా ఆ దగ్గర్లో ఉన్నవారు ఫోన్లో వీడియో తీస్తుండగా అది గమనించి మృతుడు చనిపోయినాడని భావించిన సంతోష్ తన భార్య తో కలసి అక్కడి నుండి పారిపోయినారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మద్యహ్నం 3 గంటలకు పెద్దపల్లి సీఐ , కే. ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలసి దొంగతుర్తి కి వెళ్లి నిందుతులను వారి ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగినది. నిందుతుల వద్ద నుండి నేరం చేయ్యడానికి ఉపయోగించిన కత్తి, రక్తం మరకలు గల బట్టలు, రెండు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోనైనది.