జనం న్యూస్ మే 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ ఐదవ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జి హెచ్ ఎం సి కార్మికులను శాలువా వేసి సన్మానించి బహుమతులు మరియు పండ్లు ఇచ్చారు అనంతరము అల్పాహారము అందించారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజులకొద్దీ దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని.ఈ చాకిరి మేము చేయలేమని పనిముట్లు క్రింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాటాలు చేశారని, చివరకు ప్రాణాలు సైతం త్రుణప్రాయంగా త్యాజించడం కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనమని.దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కార్మికులే ఈ దేశానికి పట్టుకొమ్ములని , తమ కష్టముతో సమాజ సంపదను పెంచేది కార్మికులేనని , శ్రామికులు తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి కార్మికులకు నెల వేతనాలు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ మండలి దయాకర్ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు ,వేముల మహేష్ ,కలిగినీడి ప్రసాద్ , అడబాల షణ్ముఖ , పాదం సూర్య ,పసుపులేటి ప్రసాద్ పులగం సుబ్బు గుణశేఖర్ నవీన్ ,మారుతి ఆత్మూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు