జనం న్యూస్ మే 1, వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణంలోని న్యూ బ్రిలియంట్ హై స్కూల్, నిన్న వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో అద్భుతంగా మార్కులు సాధించి,టాఫర్స్ గా వచ్చిన విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించిన, న్యూ బ్రిలియంట్ హై స్కూల్ డైరెక్టర్ శ్రీమతి సుశీల హనుమంత్ ముదిరాజ్. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ సుశీల హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ, విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి విద్యను అందిపుచ్చుకొని డాక్టర్లు, ఇంజనీర్లు,ఐఏఎస్ ఐపీఎస్,లు సైంటిస్టులు, వంటి ఉన్నత పదవులు సాధించాలని అన్నారు. పిల్లలు సమాజంలో ఎంత ఎదుగుతే అంత తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.