కార్మికులతో భారీ ర్యాలీ, పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ
.
కార్మికుల హక్కులను సాధించుకోవాలి.
పనికి సమాన వేతనం చట్టం అమలు చేయాలి.
ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్.
జనం న్యూస్ 02మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా పెగడపల్లి మండల కేంద్రంతో పాటు కీచులాటపల్లి, ఎల్లాపూర్,రాజారాం పల్లి, లో ఏఐటియూసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏఐటియూసి ఆధ్వర్యంలో 139వ మే డే ఉత్సవ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని కార్మికులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ 1886 లో చికాగోలో హే మార్కెట్లో యాజమాన్యం కార్మికులకు మధ్యల పోరాటంలో కార్మికులు రక్తం చిందించారని అమరవీరుల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు.చికాగో అమరవీరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గించాలని కార్మికులు సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించుకున్న 8 గంటల రద్దు చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని సమాన పనికి సమాన వేతనం చట్టం అమలు చేయాలని బోనస్ యాక్టర్లను తొలగించి ఉద్యోగ భద్రత దెబ్బతీసే విధంగా టైం బాండ్ ఎంప్లాయిమెంట్ విధానాన్ని అమలు చేయబోతుంది అని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేశారని అన్నారు. అసంఘటిత కార్మిక రంగంలోని కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని కార్మికులకు పని భద్రత కల్పించాలని పిఎఫ్ ఈపీఎఫ్ గ్రాంట్ ఇవ్వాలని కార్మికుల హక్కులను పోరాడి సాధించుకోవాలని అన్నారు. భారత్ లో ఆదివాసి బిడ్డలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో ఒప్పందం చేసుకొని అడవి సంపదను దోచుపెట్టడానికే అడవి హక్కుల ఉల్లంఘన చేస్తూ గ్రామపంచాయతీలో తీర్మానాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం 70 లక్షల కోట్ల టన్నుల సున్నపురాయి గ్రానైట్ బొగ్గు నిక్షేపాలు29 రకాల మైనింగ్ లను కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఆదివాసి బిడ్డలను అకారణంగా మిలిటరీ సైన్యం చేత చంపిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అడవి సంపదను కాపాడాలని ఇలాగే ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజల నుండి తిరుగుబాటు ఎదురవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు శనిగరపు ప్రవీణ్,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మల్లారపు నరసయ్య, ఏఐటీయూసీ మండల కన్వీనర్ రాచర్ల సురేష్, బొమ్మెన శంకర్,బొమ్మన బాబు,సిగిరి రాజ్ కుమార్, ఆత్మకూరి రాజేశం,మేక చంద్రయ్య, రౌట్ల స్వామి,తోట గంగాధర్,పటేల్ లింగంపల్లి,కొమురయ్య,మచ్చ అంజయ్య, ఇరుగురాల ప్రభాకర్,మల్లారపు శ్రీనివాస్, ఇరుగురాల కళ్యాణ్, సుంకే ప్రకాష్, సిపెళ్లి రాజేశం, శుద్ధపల్లి ఆంజనేయులు, రౌట్ల లచ్చయ్య,దీకొండ రాజయ్య,బొమ్మన లక్ష్మణ్,భోగే భూమన్న, బోగా అంజన్న, జుట్టు శేఖర్,సిపెళ్లి లింగయ్య,వడ్లూరి రాజయ్య, కోలాపూర్ హనుమంతు,తదితరులు పాల్గొన్నారు.