కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ మే 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఇందుకోసం ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టీ దేశ వ్యాప్తంగా కులగణ చర్చ జరిగేటట్లు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. కుల గణన ఆధారంగా బీసీ లకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని తెలిపారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇది ఒక్క గొప్ప మార్పుగా భావిస్తున్నామని దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ పాలన తరహాలో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన పాలన కొనసాగిస్తూ అన్నీ వర్గాల అభివృధ్ధి , సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడమే ప్రజా పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణలో కుల గణన చేయడానికి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కి మంత్రులకు,ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి,టీ పీ సీ సీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.