జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు కోరారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్బంగా సీపీఐ కార్యాలయంపై సీపీఐ పతకాన్ని,పార్టీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ పతకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, గాంధీ పార్కు ఎదుట భవన నిర్మాణ కార్మికసంఘం కార్యాలయం తో పాటు పలు ప్రాంతాలతో మేడే పతకావిష్కరణ కార్యక్రమాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . 8 గంటల పని కావాలని, బానిసత్వం నుండి విముక్తి కావాలని, పెట్టుబడిదారీ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి హక్కులు సాధించుకున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి , దౌర్జన్యాలకు దుర్మార్గాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా సమాజ మార్పు కోసం ప్రతి ఒక్క కార్మికుడు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలోనే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలు నేటి పాలకులు తుంగలో తొక్కుతూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆమె ఆరోపించారు. 44 కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా మారుస్తూ కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంచుతూ పేద మధ్య తరగతి వర్గాల పై మోయలేని భారం బీజేపీ ప్రభుత్వం వేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ముసబోయిన వెంకటేశ్వర్లు, ఏఐవైఫ్ ఏరియా కార్యదర్శి మల్లికార్జున్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసా సాంబయ్య, చిలకలూరిపేట అధ్యక్షులు తుబాటి సుభాని, ఉపాధ్యక్షుడు తాడిబోయిన సాంబయ్య , మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోమరగిరి చెంచయ్య, అక్కులయ్య,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.