పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత..
అభినందించిన కరస్పాండెంట్ వై సునీల్ కుమార్, ప్రిన్సిపల్ వేణుగోపాల శర్మ,..
జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థులు 100% రిజల్ట్ తో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు 560/600 మార్కులతో గంగారపు జెస్సికా ప్రథమ స్థానం సాధించడం జరిగింది,552/600 నాగల వైష్ణవి ద్వితీయ,540/600 దొడ్డే దేవిక తృతీయ స్థానాలతో వారి ప్రతిభ కనబరచారు. 535/600 జంగిలి నవ్య శ్రీ, 534/600 అప్పల విష్ణువర్ధన్, 530/600 రాపెళ్లి హిమాని, 529/600 మార్క అనన్య, 525/600 మూదం ఇందు, 516/600 డొంకటి వైష్ణవి, 509/600 బండి స్నేహ, 507/600 దొడ్డే క్షేత్ర, 506/600 ఉప్పు సౌమ్య, 501/600 బొనగాని రామ్ చరణ్, 500/600 మైసా స్నిగ్ధ ఇలా ఎన్నో ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వై సునీల్ కుమార్ మాట్లాడుతూ..మా పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతో ముందు ఉండడం చాలా ఆనందంగా ఉందని, స్కూల్ ఉపాధ్యాయ బృందం సమిష్టితో ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో ఉదయము, సాయంత్రము స్టడీ అవర్స్ నిర్వహించి, విద్యార్థులకు పాఠంశాలు బోధించడం జరిగిందన్నారు. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విద్యను అభ్యసించి ఈ విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు, స్కూల్ నుండి ప్రథమ, ద్వితీయ ,తృతీయ స్థానం పొందినటువంటి విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందించడం జరిగిందన్నారు, సెయింట్ జోసెఫ్ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు, ప్రథమ స్థానం 560 మార్కులు సాధించిన జి జెస్సిక, ద్వితీయ స్థానం 552 మార్కులు సాధించిన ఎన్ వైష్ణవి, తృతీయ స్థానం 540 మార్కులు డి దేవిక సాధించిన వీరందరినీ కరస్పాండెంట్ వై సునీల్ కుమార్, ప్రిన్సిపల్ వేణుగోపాల శర్మ, ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ వై సునీల్ కుమార్ ,ప్రిన్సిపల్ జె వేణుగోపాల శర్మ ,స్కూల్ ఇన్చార్జి బుడిడ జాన్, ఉపాధ్యాయులు పీ సంపత్, మహమ్మద్ కరీం, జి గణపతి రెడ్డి, డి రాధిక ,శివకుమార్, డి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.