దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్.
జనగణన తో కులగణనను స్వాగతిస్తున్నాం.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు
జనం న్యూస్. మే1. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతోపాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంలొ కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనను చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశవ్యాప్తంగా కులగణనకు బాటలు వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ కుల గణన కోసం గొంతు ఎత్తాడని వివరించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ దారి చూపాడని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. రేవంత్ రెడ్డి చొరవతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన కోసం నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జనగణన తో పాటు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టిన విధానంలోనే దేశవ్యాప్తంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ తరహాలో తెలంగాణలో పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను యావద్దేశమే గర్విస్తుందన్నారు. బీసీ కుల గణన చేపట్టి అసెంబ్లీ లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా కుల గణన జరిగేట్లు చర్చ తీసుకుని వచ్చి అనుకున్నది సాధించిన రేవంత్ కు బీసీ వర్గాలు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాయన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు కులగనన ఆధారంగా బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని అన్నారు.బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో. నర్సాపూర్ మాజీ ఎంపీపీలు. జ్యోతి సురేష్ నాయక్. శ్రీనివాస్ గౌడ్. నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్. మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు. అజ్మత్. పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్. ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్. రాజు యాదవ్. దాడిగా నరేష్. అశోక్. మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు. మాజీ సర్పంచ్లు. వివిధ గ్రామాల నాయకులు. యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.