జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హైడ్రాధికారులతో సమావేశమై అనంతరం నల్లచెరువు వద్ద అధికారులతో చెరువును పర్యవేక్షించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తగిన న్యాయం చేస్తూ టీడీఆర్ విషయంలో గానీ సరిహద్దుల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.. నిరుపేదలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని తెలిపారు.. చెరువులు సుందరీకరణకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని.. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని.. భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటే మానవాళి మనుగడ సుభిక్షంగా ఉంటుందని గుర్తు చేశారు.