పాల్గొన్న ప్రముఖులు..
జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి.
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి, సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది మనిషిని మనిషిగా గౌరవించాలి, ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి, ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముంగింపు కార్యక్రమంలో లో జిల్లా జడ్జి మరియు పోలీస్ కమీషనర్ వెల్లడి..తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి శ్రీమతి జి.వి.ఎన్. భరతలక్ష్మీ. తెలియజేశారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో పోలీస్ కమిషనర్ . పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆద్వర్యంలో ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు ఫ్రీ పోలీస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు.ఈ మేరకు శుక్రవారం ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా జడ్జి శ్రీమతి జి.వి. ఎన్. భరతలక్ష్మీ మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్. పి.సాయి చైతన్య, ఐ.పి.యస్.,, ప్రోబేషనర్ ఐ.పి.యస్., సాయి కిరణ్ హజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి. మాట్లాడుతూ తల్లి, దండ్రులు, చెప్పిన మాటలను విని వాటిని మనము అలవాటు చేసుకున్నప్పుడు మనం ఇతరులతో ఎలామాట్లాడాలో మంచి మెలకులు నేర్చుకోగలిగిన వారము అవుతామన్నారు. విద్యార్థినీలు చదువుకునే సమయంలో ఎక్కువగా ఈవ్ టీజింగ్ ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సమ్మర్ క్యాంప్ లో నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో కెరీర్ బిల్డప్ చేసుకోవాలని, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని తెలిపారు. అయితే ఇందులో కెరీర్ బిల్డప్క కన్న ,క్యారెక్టర్ బిల్డప్ జీవిత కాలం ఉపయోగపడుతుందన్నారు. కొన్ని ప్రోగ్రామ్ ల ద్వారా ఇలాంటి సమ్మర్ క్యాంప్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని అందులో మనం మంచి నేర్చుకొని ముందుకు సాగాలన్నారు. ఈ రోజులలో సెల్ఫోను ప్రతి ఒక్కరూ బానిస అవుతున్నారని సెల్ఫోన్ వదిలివేయాలని, సెల్ఫోన్లను ఎంత దూరం పెడితే మనకు అంత మంచిదని తెలిపారు. సెల్ఫోన్ ఉపయోగం వల్ల మంచి ,చెడు రెండు ఉంటాయన్నారు. మంచికన్న చెడు ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున ఎంతతక్కువ ఉపయోగిస్తే అంత మంచిదన్నారు. పర్సనల్, ప్రైవసీ రెండు ఉంటాయని పర్సనల్ ఎంత ముఖ్యమో ప్రైవసీ కూడా అంతే ముఖ్యమన్నారు. రోజువారీగా మనం నేర్చుకున్నది ఇతరులకు తెలపడం ద్వారా మంచి భవిష్యత్తు లో స్థిరపడతారని తెలిపారు. ఇలాంటి సమ్మర్ క్యాంప్ లు . పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ డం ఎంతో అభినందనీయమని అభినందించారు.తదువరి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. బాలికలు సమాజంలో ఎలా ఉండాలనే విషయాల ను ఈ క్యాంప్ లో నేర్చుకున్నారని విద్యార్ధినీలకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ తరగతుల ద్వారా ఎన్నో నేర్చుకున్నారని, తైక్వాండో ,సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తో వారిని వారు రక్షించుకోవడానికి పలు మెలకువలు నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలని చూసిన వాటిని చెప్పేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. ప్రతీ ఒక్కరు అన్నింటిలో మంచి స్కిల్స్ పెంపొందించుకోవాలని మంచిగా ఆలోచించి విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఆలోచన దృక్పదం విద్యార్థినీలలో పెరిగి కొంతమేర మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరికీ ఒక గొప్ప అనుభవం కల్పిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఈ శిబిరం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారని, ఈ శిబిరం ద్వారా మీ పై నమ్మకం పెంచుకుంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రోత్సహించబడుతారు అని తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు జరిగిన కార్యక్రమాల గురించి నిజామాబాద్ సౌత్ సర్కిల్ సి.ఐ సురేష్ కుమార్ ,రిటైర్డు ఇన్స్ పెక్టర్ కిషన్, రోజువారి కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా వివరించారు.ఫ్రీ సమ్మర్ క్యాంప్ ఏం నేర్చుకున్నారో ఎలా జరిగిందో విద్యార్ధినీలు సైతం స్వయంగా వారు నేర్చుకున్నది సమావేశంలో తెలియజేశారు తైక్వాండో ట్రెయినర్ మనోజ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు నేర్చుకున్న మెలకువలను ప్రదర్శించారు. ఫ్రీ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన వారికి ప్రశంసా పత్రములు అందజేశారు.
కార్యక్రమంలో ప్రొబేషనర్ ఐ.పి.యస్. సాయికిరణ్ నిజామాబాద్ సౌత్ రూరల్ సి.ఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, జె.సి.ఐ సభ్యులు విజయానంద్, ఆర్.బి.వి.ఆర్.ఆర్ సొసైటి సభ్యులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.