అంగరంగ వైభవంగా బంజారా నృత్య నాట్య ప్రదర్శనతో విగ్రహాలను ఊరేగింపుగా బంజారా భక్తులు
జనం న్యూస్,మే 02, కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల చౌకన్పల్లి రామ్ సింగ్ నాయక్ తండలో నూతనంగా శ్రీ జగదంబ భవాని మాత,సేవాలాల్ మహారాజ్,ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శ్రీ జగజ్జనని అమ్మవారి విగ్రహం,శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను, ఆలయ శిఖరాలను, శుక్రవారం ప్రత్యేక వాహనంలో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా మండల కేంద్రం నుంచి ఆలయం వరకు బంజారా సాంప్రదాయ నృత్య నాట్య ప్రదర్శనలతో తీసుకు వెళ్లడం జరిగింది.విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముడు రోజుల పాటు నియమ నిష్టలతో విధివిధానాలతో, శనివారం నుంచి విగ్రహ ప్రాణ ప్రతిష్ట,ఆలయ శిఖరా రోహణం నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర బంజారా కాశి పౌరా దేవి పీఠాధిపతులు శ్రీ శేఖర్ మహారాజ్, విచ్చేయుచున్నారని ఆలయ అర్చకులు తారా సింగ్ మహారాజ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల బంజారా భక్తులు,బంజారా సహోదరులు,బంజారా నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో పాటు,సంత్ సేవలాల్ మహారాజ్,ఆశీస్సులు పొంది తమ జన్మను తరింప చేసుకోవాలని అన్నారు.