మండల అధ్యక్షుడు పరశురాం రావు
జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రావు. వారు ఇ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కమిటీ ద్వారా ఇంటి ఎంపిక చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు అయినా, టిఆర్ఎస్, బిజెపి, వాళ్లు ప్రజా పాలన ను ఓర్వలేకే ఆసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పదేళ్ల పాలనలో అటు దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారు ఇచ్చిన వాగ్దానాలు మరిచి ఎన్నికల్లో మాత్రమే హామీలను వాడుకొని వాటికి ఎగనామం పెట్టేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మోడీ ,డబుల్ బెడ్ రూమ్ పథకం కింద కేసీఆర్ ప్రజలకి ఏనాడు న్యాయం చేయలేదు అని మండిపడ్డారు. ఈ నాడు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరగడం వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు అని, అలా ఓర్వలేకే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలను మభ్యపెట్టి వారిని మోసం చేయడానికి చూస్తున్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అని ప్రభుత్వ ప్రధాన ధ్యేయం లబ్దిదారులకి లబ్ధి పొందడం, అంతే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మా ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకి వాటి ఫలాలు, అందుతాయి అని మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఎలాంటి తప్పులు చేయరని, ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బిజెపి,బిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ధీటుగా హెచ్చరించారు.