జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
శివప్రసాదరావు జయంతి సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణలో ప్రత్తిపాటి
పల్నాడు పులిగా ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు చేపట్టి, ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి కోడెల అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. కోడెల వంటి మహానాయకుడి జయంతిని పురస్కరించుకొని, ఆయన రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి చేసిన సేవల్ని తెలుగుప్రజలు మననం చేసుకుంటారని, చరిత్ర ఉన్నంత కాలం కోడెల వారి హృదయాల్లో నిలిచేఉంటారని ప్రత్తిపాటి చెప్పారు. కోడెల శివప్రసాదరావు జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిసి ప్రత్తిపాటి ఆవిష్కరించారు. అమరావతి పున:నిర్మాణం రోజున మహానాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషించాల్సిన అంశమని, ఈ మధుర క్షణాలు టీడీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. పల్నాడు జిల్లా అభివృద్ధిలో కోడెల చెరగని ముద్రవేశారని, కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రత్తిపాటి కొనియాడారు. కోడెల ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట, సత్తైనపల్లి నియోజకవర్గాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఫలితాలను నేటికీ ప్రజలు అనుభవిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివరాం, గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.