(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మే 3, జగిత్యాల జిల్లా,
కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జ్యోతి అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతుండగా కోరుట్ల పట్టణంలోని శ్రీ దుర్గా యూత్ అసోసియేషన్ సభ్యుడు, సామాజిక సేవకుడు వాసాల నవీన్ విషయం తెలుసుకొని స్వచ్చందంగా మెట్పల్లి పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. అత్యవసర సమయంలో 8వ సారి రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన నవీన్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మరియు శ్రీ దుర్గా యూత్ అసోసియేషన్*సభ్యులు, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ ఇప్పటివరకు 8 సార్లు బ్లడ్ డొనేషన్ చేశానని ఇకముందు కూడా ఎవరికైనా అవసరం వస్తే ఇస్తానని ఇలా నేను బ్లడ్ ఇవ్వడం వల్ల ఇతరుల ప్రాణం నిలబెట్టడం పట్ల నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు, ఇకముందు కూడా నా గ్రూప్ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు