జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బెజ్జూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులు మమేకమై నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు ఎస్ఐ సూచించారు. నేరాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఎస్సై సూచనలతో వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు పాల్గొన్నారు.