ఇండ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీదే నిర్ణయం.
జనం న్యూస్,మే03,జూలూరుపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకే ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో చిన్న ఫిర్యాదు వచ్చిన ఉపేక్షించేది లేదని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా చెబుతున్న, ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపిక విషయంలో మంత్రి ఆదేశాలను పక్కనపెట్టి వారికి నచ్చిన, తెలిసిన వారికే, వాళ్లు అనర్హులైన సరే వారికి కేటాయించడం జరుగుతుందని, అసలైన లబ్ధిదారులకు మొండి చేయి చూపుతున్నారని, మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మండల వ్యాప్తంగా నిరసనలు,అభ్యంతరాలు ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపణలు వస్తున్నాయి అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని పలుచోట్ల ఆందోళనకు,నిరసనలకు దిగుతున్నారు ఈ నేపద్యంలో జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని రేగళ్ల తండాకు చెందిన కొంతమంది గ్రామస్థులు ఇందిరమ్మ ఇండ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు దీనితో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది అర్హులైన వారికి ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇళ్ల కేటాయింపులు జరిగాయని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆరోపిస్తున్నారు తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగేది లేదని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ పై నుండి కిందకు దిగారు.