జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సారా రహిత జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నవోదయం 2.0 కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో మార్చి 25 నుంచి నేటి వరకు 11 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్టు చేశామన్నారు. 726 లీటర్ల బెల్లపు ఊటలు, 56 లీటర్ల సారా ధ్వంసం చేసినట్లు చెప్పారు.177 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.