జనం న్యూస్ మే(4) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గంలో ని తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనా దృష్ట్యా సన్నధాన్యం పండించిన వారికి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన తెలిసిందే. గత సీజన్లో పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అదనంగా 500 బోనస్ ఇచ్చాడు. కానీ ఈ సీజన్లో మాత్రం తుంగతుర్తి మండలం మొత్తం మీద ఒక సెంటర్ కూడా సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు తుంగతుర్తి శాసనసభ్యులు చొరవ తీసుకొని మండల కేంద్రంలో సన్నా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.