జనం న్యూస్,మే05,అచ్యుతాపురం:
వర్ధమాన్ పరిశ్రమ గేటు వద్ద కార్మికులతో సీఐటీయూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము, మండల కన్వీనర్ కే. సోమనాయుడు మాట్లాడుతూ
అధిస్తాన్ లో ఉన్న వర్ధమాన్ పరిశ్రమలో వేతనాలు పెంచకుండా 12 సంవత్సరాలుగా శ్రమ దోపిడికి గురి చేస్తుందని కార్మికుల్ని వేధింపులు గురిచేస్తున్న యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని, ఓటి చేసిన కార్మికులకు భోజనం, రవాణా వంటి సదుపాయాలు కల్పించాలని, సెలవులు,ఉద్యోగ భద్రత, నెలకు రెండు గంటలు పర్మిషన్, స్కూల్ పిల్లలకు బ్యాగులు, స్కాలర్ షిప్, యూనిఫామ్, ప్రసూతి సెలవులు తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన్ కార్మికులు పాల్గొన్నారు.