జనం న్యూస్,మే06,అచ్యుతాపురం:అచ్యుతాపురం
పోలీస్ స్టేషన్ ఎదురుగా డిజిటల్ లైబ్రరీలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,మాజీ జడ్పి ఛైర్మన్ లాలం భవాని భాస్కర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బీసీ కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో మహిళల సంరక్షణ ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలలో శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి ఎంబ్రాయిడింగ్ సెక్షన్ లో శిక్షణను ఇప్పించి నియోజకవర్గంలో బ్రాండిక్స్ లాంటి పెద్ద కంపెనిలలో అవకాశం కల్పించడం మహిళలు అందరిని ప్రయోజకులుగా చూడాలన్నదే నా ఉద్దేశం అని తెలియజేస్తూ.. ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని అన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఎలమంచిలి నియోజవర్గ అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో కుట్టు మిషన్ శిక్షణ టైలరింగ్ కేంద్రాలను ఆ యొక్క గ్రామ నాయకులతో ప్రారంభించడం జరిగింది. మహిళలందరికీ వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాలలో 90 రోజులు పాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టుమిషన్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.. .ఈ కార్యక్రమంలో అధికారులు,ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.