జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 29న ప్రత్తిపాటి గార్డెన్స్ నందు శంకర్ కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా క్యాంపును నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు అన్నారు.బుధవారం పట్టణములోని టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఇటీవల కాలంలో కాటూరి మెడికల్, ఆసుపత్రి సహకారంతో పలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారని, పేదలకు వైద్యం అందించటంలో ప్రత్తిపాటి ముందు ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంపౌండర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.