సి సి కెమెరాలనుపరిశీలించిన ఎస్సై బి. రాము
జనం న్యూస్ మే 14:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామంలోబుధవారం రోజునా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటును స్థానిక ఎస్సై బి రాము గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షించి గ్రామంలో ఏడు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఏ గ్రామంలోనైనా సీసీ కెమెరాలుఒక వేళ పనిచెయ్యకపోతే వాటిని టెక్నీషియన్ తో రిపేర్ చేయించుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతోవారి గ్రామాలను సురక్షితంగా, దొంగల బారిన పడకుండా మనమే కాపాడుకోవచ్చని అంతే కాకుండా ఎవరైనా ఎక్సిడెంట్ చేసిన కనిపెట్టవచ్చని అన్నారు. మరియు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బత్తుల సంజీవ్,సభ్యులు రైతు రమేష్,కాటిపల్లి పెద్దసాగర్,నూకల గంగాధర్ యాదవ్, నందు,రఫీ,గ్రామస్తులు బాలే శ్రీనివాస్, భూఖ్య రమేష్ తదితరులు, ఎస్ఐ వెంట ఉన్నారు.