జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం (M) ద్వారపూడిలో కారు లాక్ డోర్ పడి ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉదయం టిఫిన్ చేసి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు సమీపంలో ఉన్న కారులోకి వెళ్లి డోర్లు వేయగా లాక్ పడింది. ఎవరూ గమనించకపోవడంతో చిన్నారుల మృతి చెందారు.
పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఉదయం నుంచి వెతికారు. సాయంత్రం కారులో పిల్లల మృతదేహాలను గమనించారు. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. చిన్నారుల మృతిపై దిగ్హాంతి వ్యక్తం చేసిన మంత్రి పై దిగ్ర్రా త్రి విజయనగరం జిల్లా ద్వారపూడిలో నలుగురు చిన్నారుల మృతి చెందడంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కారులో చిక్కుకుని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో చిన్నారుల కదలికలను ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.