జనం న్యూస్ మే 19 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కెపిహెచ్బి కాలనీలో ముడవ రోడ్ లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు శ్రీ మహాదేవ జీర్నోద్ధరణ సహిత శ్రీ పార్వతి దేవి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో రాజేశ్వరరావు పాల్గొని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దివ్యదర్శనమును గావించారు అనంతరం ఆలయ అర్చకులు వేదఆశీర్వచనలతో ఆశీర్వదించగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు, రాజేశ్వరరావు ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకొని ఆలయ కమిటీ సభ్యులకు కొన్ని సలహాలు సూచనలు చేశారు, అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా తన చేతుల మీదుగా వడ్డించి సేవ చేసుకున్నారు తదనంతరం కమిటీ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్.ఎస్.ఎన్ రాజు, ఎల్లారెడ్డి, వి శ్రీనివాసరావు, ఏ ప్రదీప్, తుల్జా గణేష్, సత్యనారాయణ, బాలాజీ నగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు గోపి వారి మిత్ర బృందం, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.