మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కష్టపడ్డ వారికే అంటున్న పార్టీ శ్రేణులు
జనం న్యూస్ , మే 19( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానంపై ఎందరికో కన్ను పడిన నేపథ్యంలో సర్వేలో విస్తుపోయే విషయాలు వెళ్లడి అయ్యాయి. మండల కాంగ్రెస్ నాయకుడుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పదేళ్లుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాదిగా కొనసాగిన ప్రస్తుతం ఉన్న పార్టీకోసం ప్రజల కోసం పాటుపడేవాడే రావాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిన విధేయతకు మెచ్చి మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం కల్పించాలని అధిక శాతం మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. అధిక శాతం శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వారిలో మెజారిటీ సభ్యులు సైతం పార్టీ కోసం కష్టపడ్డ వారికే అంటూ చెప్పడం గమనార్హం. అయితే వివాదాలకు దూరంగా పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉండాలని ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అంటూ అతడు ముందు ఉంటాడలని మండలంలో మంచి గుర్తింపు ఉంచుకొని జిల్లా నాయకత్వంలో మంచి పేరు తెచ్చుకున్న అని చర్చ నడుస్తోందో నాయకుడు నూటికి నూరుశాతం అధ్యక్ష స్థానం కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నా ఉండాలని, త్వరలోనే అధ్యక్ష స్థానానికి పోటీ జరుగనున్న నేపథ్యంలో మారనున్న సమీకరణాలను బట్టి ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.? సోమవారం చెన్నూర్ నియోజకవర్గo ఎమ్మెల్యేవివేక్ వెంకటస్వామి క్యాంపస్ లో మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డికి నూతనమండల అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కొక్కుల నరేష్ భూనేని సుధాకర్ కోట రమేష్ మాజీ సర్పంచ్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు