జనం న్యూస్, మే 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం మార్కుక్ మండలం వివిధ పాఠశాలలో పని చేస్తున్న L. F. L మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం తేది 20/5/2025 నుండి 24/5/2025 వరకు మొత్తం 5 రోజులు మండలం స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కుక్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుపబడును.., ఇట్టి శిక్షణ కార్యక్రమం కి మండల విద్యాధికారి ఏ, వెంకట రాములు, కోర్స్ డైరెక్టర్ గాను మరియు రిసోర్స్పర్సన్స్ గా రామకృష్ణ రెడ్డి, దయాకర్ రావు, శ్రీధర్, మధు, బాలకృష్ణ,కమలాకర్ రెడ్డి, భూపతి రెడ్డి, మల్లేశం పాల్గొంటున్నారు, ఇట్టి శిక్షణ కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు హాజరు కానున్నారు.., ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఒక సానహక సమావేశం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, మరియు సంఘ బాధ్యులు శ్రీనివాసరావు, రమణ రావు పాల్గొన్నారు, ఉపాధ్యాయులు అందరు ఇట్టి శిక్షణకు సకాలం లో హాజరు అయి వృత్తి మరియు బోధన నైపుణ్యం మెరుగు పర్చుకొని పిల్లల విద్య అభివృద్ధి.పాటుపడాలని మండల విద్యాధికారి కోరారు..