జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే ని మర్యాద పూర్వకంగా కలిసిన NDA కూటమి నాయకులు హిమగిరి నాథ్,సయ్యద్ అమీర్,సర్పంచ్ రాము,కొట్టే శ్రీహరి,సురేష్ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవంను పురష్కించుకొని నందలూరు మండలంలో ఈరోజు 21-5-2025 వ తేది బుధవారం సాయంత్రం 4గంటలకు అరవపల్లిలోని శ్రీ కృష్ణ మందిరం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం వరకు భారత సైన్యంకు సంఘీబావంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వ హించబడును.ఈ కార్యక్రమానికి సంబంధించిన పర్మిషన్ ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే దగ్గర తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయనను NDA కూటమి నాయకులు శాలువతో సత్కరించడం జరిగింది.
ఈ ర్యాలీలో NDA కూటమి నాయకులు,దేశభక్తులు,ప్రజలు,విద్యార్థులు,రాజకీయ ముఖులు,మేధావులు,ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్ని జయప్రదం చెయ్యలవలసిందిగా కోరుతున్నాము