జనం న్యూస్ మే 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా మినీ మహానాడు, పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్ లో రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మినీ మహానాడు 22వ తేదీ గురువారం ఉదయం 9:30 కు ప్రారంభమవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు తెలియజేశారు. ఈ మహానాడు సమావేశమునకు ముఖ్యఅతిధులుగా , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు , జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొంటున్న ఈ సమావేశానికి జిల్లా శాసన సభ్యులు, మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు ఆధ్వర్యంలో జరుగును.ఈ కార్యక్రమమునకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ మండల ఎంపీపీలు, జడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ, డీసీఎంఎస్ చైర్మన్లు, గతంలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల మాజీ చైర్మన్లు,వివిధ కులాల రాష్ట్ర డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, పాల్గొనవలసిందిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బత్తుల తాతయ్యబాబు, లాలం కాశినాయుడు ఒక ప్రకటనలో తెలియజేసారు!.//