ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 21 (జనం న్యూస్):
నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ
సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ప్రముఖ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు బిక్కా రామాంజనేయరెడ్డి జిల్లా పోలీస్ శాఖకు డ్రోన్ కెమెరా స్పాన్సర్.
జిల్లా ఎస్పీ డ్రోన్ కెమెరాను బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డికి అందజేశారు.
బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కాపాడుట, నేరాలు అండ్ ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు సలకలవీడు గ్రామములో స్వయం భువెశ్వర శ్రీ దక్షిణాబిముఖ అభయ వీరాంజనేయ స్వామి వంశపారంపర్య ధర్మకర్త, ప్రముఖ సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు, గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బిక్కా రామాంజనేయరెడ్డి బుధవారం జిల్లా "ఎస్పీ" కి అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన డిజెఐ ఏ ఐ ఆర్ 3ఎస్ డ్రోన్ 1,58,000 రూపాయలు విలువ చేసే కెమెరాను అందచేశారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్న ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో బహుకరించటం అభినందనీయమని జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ ను బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అందచేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ డ్రోన్ కెమెరా ద్వారా లా అండ్ ఆర్డర్, నేర నియంత్రణ, రద్దీగా ఉండే జంక్షన్ లు పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ట్రాఫిక్ నిర్వహణకు, ముఖ్యమైన కేసుల్లో క్రైమ్ సీన్ మానిటరింగ్ ద్వారా నేర దృశ్యాలు సాక్షాల సేకరణకు, పలు బందోబస్తులు, బహిరంగ సభలు, జాతరలు, ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, విపత్తు సమయంలో రెస్క్యూ అండ్ సహాయక చర్యలు, తప్పిపోయిన వ్యక్తులు, అనుమానితులను గుర్తించడం వంటి టార్గెట్ ట్రాకింగ్ కు, తీర ప్రాంత గస్తీకి, ఈవ్ టీజింగ్ సర్వేలన్స్, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు నివాసిత ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడకు డ్రోన్ లను పంపి నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని తద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించటానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున రావు, బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి, కంభం ఎస్సై నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.