జనం న్యూస్ మే 21:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :బుధవారం తెల్లవారుజామున రెండు గంటల తర్వాత ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఏర్గట్ల నుండి బట్టాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో రెండు చోట్ల రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు అడ్డంగా పడిపోయాయి. రోడ్డుపై పడి ఉన్న చెట్లను ఎవరు పట్టించుకోకపోవడంతో బట్టాపూర్ గ్రామానికి చెందిన యువకుడు దయానంద్ తో పాటు పలువురు యువకులు అటువైపు వెళ్తున్న ప్రయాణికులు కలిసి బట్టాపూర్ శివారులోని రోడ్డుపై పడి ఉన్న చెట్లను తొలగించడం వలన రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. రోడ్డును ఏర్గట్ల శివారులోని భీమన్న ఆలయం సమీపంలో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లను ఏర్గట్ల గ్రామపంచాయతీ కార్యదర్శి జాకీర్ తన సిబ్బందితో కలిసి రోడ్డుపై పడి ఉన్న చెట్టును తొలగించారు.