జనం న్యూస్; 22 మే గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్
2015- 2020 మధ్యలో డిగ్రీ ఫెయిల్ అయిన వారికి అవకాశం 2017 నుంచి 2020 మధ్యాహ్న డిగ్రీ చదివి ఉత్తీర్ణులు కానివారి కోసం వన్ టైం ఛాన్స్ కింద పరీక్షలు రాసుకోవడానికి విశ్వవిద్యాలయం కళాశాలకు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సునీత ఒక ప్రకటన తెలిపారు. 5 సంవత్సరాలు సంబంధించి ఒకడి నుండి ఆరు సెమిస్టర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ పరీక్షలు రాసేందుకు అర్హులని తెలిపారు .పరీక్ష ఫీజు చెల్లించడానికి జూన్ 20 వరకు అవకాశం ఉందని అపరాధ రుసుముతో జూన్ 25 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కళాశాలలోని పరీక్షల నియంత్రణ అధికారి కార్యాలయంలో పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని చెప్పారు. మరిన్ని వివరాలను కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ గోపాల సుదర్శనాన్ని సందర్శించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.