జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. డిచ్పల్లి , ధర్పల్లి పల్లి పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించడం జరిగింది.
1) పోలీస్ స్టేషన్లను మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు 2) రిసిప్షన్ సెంటర్ల పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 3) 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. 4)వాహనాల పార్కింగ్ చూసారు. 5)రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. 6) గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 7) సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు 8) గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు. 9) సిబ్బoది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకొనరు.
ఈ సందర్బంగా డిచ్పల్లి CI కె. మల్లేష్ , ధర్పల్లి CI బి. బిక్షపతి , డిచ్పల్లి SI MD. షరీఫ్ , ధర్పల్లి SI రామకృష్ణ, డిచ్పల్లి మహిళా SI సుహాసిని , si.ఎల్. రాము మరియు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.