జనం న్యూస్. మే 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
హత్నూర మండలంలో తుర్కల ఖానాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బుధవారం పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడుపాయల్లో ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఇలా ఒకే చోట కలుసుకోవడంతొ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో. బిక్షపతి. కే కృష్ణ. డి బిక్షపతి.అంజనేయులు. నాగేశ్వరరావు. జి కృష్ణ. భాస్కర్ గౌడ్. గణేష్. మల్లేశం. రాజు. హరికృష్ణ. మాణిక్యం. విష్ణు. నిర్మల. లక్ష్మి. వీరమణి. స్వర్ణలత. తదితరులు పాల్గొన్నారు.