జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన ముద్దాయికి సహకరిస్తున్న ఇద్దరిని విశాఖ సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు అరెస్ట్ అయిన ముద్దాయిల నుంచి సేకరించిన సమాచారంతో విజయనగగరానికి చెందిన గండి గణేశ్, పల్లి రామకృష్ణను అరెస్టు చేశారు. వారి నుంచి 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించారు.