

జనం న్యూస్ మే 23 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.సోషల్ మీడియా, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యూప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో మండల ప్రజలు, యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.