రైతులకు నాణ్యమైన వితానాలు అందించడం విత్తన సంస్తల,డీలర్ల బాద్యత.
కె. నరసింహ, ఎస్పీ సూర్యాపేట జిల్లా
జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవద్దని,వ్యవసాయ పనులు ప్రారంభించడానికి రైతులు సిద్ధమౌతున్నారనీ, అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల సూర్యాపేట జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నిర్మూలనకు అధికారులకు స్ప్రస్తమైన ఆదేశాలు జారీ చేయడం జరిగినదన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు,డీలర్లు,వ్యాపారులపై పై ఉన్నదన్నారు.విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామనీ, పిడి యాక్ట్ తప్పదని, షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నదని, ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలి అని ఎస్పీ సూచించారు. రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలని, గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలి అని ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలని, లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దు అని కోరారు.తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మద్యవర్తుల వద్ద విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దనీ,ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిది అన్నారు.ఇతర రాష్ట్రాల నుండి జిల్లాల లనుండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని వెల్లడించారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల ని ఎస్పీ నర్సింహ సూచించారు.