ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మే23,
అచ్యుతాపురం: ఈ నెల 24 శనివారం ఉదయం ఆరు గంటలకు జరిగే మెగా క్లీనింగ్ డ్రైవ్ అనే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మంచి ఉద్దేశం మేరకు తమ వంతుగా లారస్ కంపెనీలో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులు వాలంటీర్లుగా పాల్గొనడానికి సిద్ధం అయ్యారు.యలమంచిలి కూటమి నాయకులు, కార్యకర్తలు,జన సైనికులు,జనసేన వీర మహిళలు, పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ కోరారు.