జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
రూ.35లకల పురపాలకసంఘ నిధుల గోల్మాల్ లో రజనీ, ఆమె మరిది గోపీలే అసలు లబ్ధిదారులు
జీతంపై బతికే సాధారణ ఉద్యోగుల్ని సస్పెన్షన్ పై పునరాలోచన చేయండి
ప్రజల సొమ్ము కాజేసిన గంగా భవానీ ఆమె భర్త పవన్ రజనీ కీలక అనుచరులు.
వారిని విచారిస్తే రజనీ, ఆమె మరిది గోపి పాత్ర, ప్రమేయం బయటపడుతాయి
రైస్ మిల్ పై రేకులు వేసుకోవడానికి రజనీ మరిది రూ.15 లక్షలు కట్టమన్నాడు
ప్రజావేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటికి ఫిర్యాదుచేసిన మాబు సుభాని.. స్థానికులు, రైస్ మిల్ యజమాని సుబ్బారావు.
ఇటీవల చిలకలూరిపేట మున్సిపాలిటీలో వెలుగుచూసిన నిధుల స్వాహాలో మాజీమంత్రి రజనీ, అమె మరిది గోపిలే అసలు దోషులని, వారి పాత్ర, ప్రమేయం తేలాంటే నిదులు కాజేసి పరారైన ఇక్తుర్తి గంగాభవాని, ఆమె భర్త పవన్ లను విచారించాలని స్థానికుడు షేక్ మాబు సుభాని మరియు స్థానికులు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజావేదిక నిర్వహిం చారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలు స్వీకరించిన ఆయన, వాటి పరిష్కారంపై వెంటనే అధికారులతో మాట్లాడారు. వైసీపీ హాయాంలో నియోజకవర్గంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిన విడదల రజనీ, ఆమె మరిది గోపి, అనుచరులపై వచ్చిన ఫిర్యాదుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రత్తిపాటి, సమగ్ర విచారణ జరిపించి అవినీతిపరులకు శిక్ష పడేలా చూస్తానని ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. మున్సిపాలిటీ నిధుల స్వాహాలో అసలు దొంగలు విడదల రజనీ..ఆమె మరిది గోపీనే. కూటమిప్రభుత్వం ఏర్పడ్డాక చిలకలూరిపేటలో వెలుగుచూసిన రూ.35లక్షల నిధుల గోల్ మాల్ వ్యవహారంలో అసలు దోషులు రజనీ, ఆమె మరిది గోపీలేనని పట్టణవాసులు షేక్ మాబు సుభాని తదితరులు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి ఫిర్యాదుచేశారు. నిధుల స్వాహాకు పాల్పడి పరారైన శ్రీమతి ఇక్కుర్తి గంగాభవాని, ఆమె భర్త పవన్ లు రజనీకి కీలక అనుచరులని, వారిని పట్టుకొని విచారిస్తే మాజీమంత్రి, ఆమె కుటుంబసభ్యుల పాత్ర బయటకు వస్తాయని ఫిర్యాదుదారు సుభాని ప్రత్తిపాటికి తెలియచేశారు. నిధుల వ్యవహారంలో ప్రభుత్వం 17 మంది మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుందని, అసలు దోషుల్ని కనిపెట్టి శిక్షించాక, ఉద్యోగుల సస్పెన్షన్ పై పునరాలోచన చేయాలని సుభాని మరియు స్థానికులు తమ ఫిర్యాదు లో కోరారు. ఫిర్యాదును పరిశీలించిన ప్రత్తిపాటి.. ప్రజలసొమ్ము కాజేసిన వారు ఎవరైనా, ఎంతటివారైనా ఎక్కడున్నా గుర్తించి తగిన శిక్షలు పడేలా చూస్తామని, తప్పుచేయని వారు భయపడాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. రేకులు వేయాలంటే రూ.15లక్షల ఇవ్వాలని బెదిరించారు. :వైసీపీ ప్రభుత్వంలో తన రైస్ మిల్లుపై రేకులు వేసుకుంటుంటే, అప్పటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సునీత పనులు ఆపి, అప్పటి మంత్రి విడదల రజనీని కలిసి మాట్లాడుకోవాలని తనను బెదిరించారని ఇంటూరి సుబ్బారావు శుక్రవారం మాజీమంత్రి ప్రత్తిపాటికి చెప్పారు.. తాము కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, పాడైపోయిన పాత రేకుల స్థానంలో కొత్తవి వేసుకుంటున్నామని, దానికి రజనీని ఎందుకు కలవాలని అప్పట్లో ప్రశ్నిస్తే తనను భయపెట్టారని సుబ్బారావు చెప్పారు. నెలరోజులు పనులు ఆపడంతో చివరకు చేసేదేం లేక రజనీ మరిది విడదల గోపిని కలిస్తే, తమకు రూ.15లక్షలు ఇచ్చి రేకులు వేసుకోవాలని చెప్పాడని ఫిర్యాదుదారు సుబ్బారావు ప్రత్తిపాటికి తెలియచేశారు. అంత డబ్బు ఇవ్వలేనని కాళ్లావేళ్లా పడి బతిమాలితే చివరకు రూ.8లక్షలు ఇవ్వాలని, లేకుంటే రైస్ మిల్ కూడా నడవనివ్వమని గోపి బెదిరించడంతో ఆ మొత్తం సొమ్ము ఇచ్చి పని పూర్తిచేసుకున్నా నని ప్రత్తిపాటికి చెప్పుకొని సుబ్బారావు వాపోయారు. ఆనాడు తనను ఇబ్బంది పెట్టిన వారిని ఏమీ చేయలేకపోయానని, కూటమిప్రభుత్వంలో న్యాయంచేస్తారనే ఫిర్యాదు చేస్తున్నానని, తన సమస్యపై తగిన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బాధితుడు సుబ్బారావు, ప్రత్తిపాటిని అభ్యర్థించారు. నాడు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు తెలుసుకొని సుబ్బారావుని ఇబ్బందిపెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పోలీస్ వారిని ఆదేశించారు. ప్రజావేదిక కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, కందుల రమణ, తదితరులున్నారు.