లైసెన్స్ లు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తాం
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్
జనం న్యూస్ 27మే 2025.కొమురం భీమ్ జిల్లా.
డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ : డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలుంటాయని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ హెచ్చరించారు. మంగళవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసీన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సీడ్స్ ఫర్టీలేజర్ వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మితే వ్యాపార లైసెన్స్ లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాం అన్నారు. రైతులు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు అని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లోకేన్దర్ షేకు,లింగు, మాజీ సర్పంచ్ లు , ఆదివాసీ నాయకులు శంకర్, అమృత్, దత్తు, మండల మాజీ కో అప్షన్ సభ్యుడు ఫేరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కోట్నక దౌలత్ రావ్, హైదర్ తదితరులు ఉన్నారు