జనం న్యూస్ మే 27 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వం ఐదు వందల గజాల స్థలం ఇచ్చి కళాకారులను ఆదుకోవాలి*
తెలంగాణ సాధనలో కళాకారులది ప్రధాన పాత్ర
గత 30 సంవత్సరాల నుండి కళనే నమ్ముకుని జీవనం సాగిస్తూ, తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాల పాటు ఎనలేని కృషిచేసి తెలంగాణ రావడంలో ప్రధాన భూమిక వహించింది కళాకారులని పలువురు నేతలు అన్నారు, కొమురవెల్లి లోని హోటల్ వన్ లొ జరిగిన తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సమావేశంలో వివిధ రంగాల కళాకారులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా కలకు జీవం పోస్తూ ఎవరికి వారికి జీవిస్తున్న మనం ఇప్పుడు ఒకటై ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు ఎటువంటి చేయూతలేదని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా కళాకారులను ఆదుకోవాలని వారి కుటుంబాల్లో వెలుగు నింపాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు, తీర్మానాలు ప్రభుత్వం ఒక్కొక్క కళాకారునికి ఐదు వందల గజాల భూమిని కల్పించాలి, కళాకారులకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలి,
వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలి, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి, కళాకారులకు ఆరోగ్య భీమా ఇస్తూ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయాలి, ఈ సందర్భంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కమిటీని ప్రకటించడం జరిగింది అధ్యక్షుడిగా పత్తిపాటి రమణాకర్,ప్రధాన కార్యదర్శిగా సత్తార్ బాయ్,కోశాధికారిగా గజ్వేల్ వేణు, ఉపాధ్యక్షులుగా జిఎల్ నాందేవ్, ఫోక్ ఇండస్ట్రీ సలహాదారులుగా దరువు అంజన్న, మిట్టపల్లి సురేందర్, అంతడుపుల నాగరాజ్, అభినయ శ్రీనివాస్, కోదారి శీను, అంబటి వెంకన్న, బైరాగి మోహన్, కళాంజలి రాజేష్, దత్తాత్రేయ, చికోడు నరసింహులు, కాదూరి గణేష్,వస్పరి విష్ణు, కాపర్తి మల్లికార్జున్ ఉన్నారు, కోర్ కమిటీ సభ్యులుగా జడల రమేష్,మాట్ల తిరుపతి, శంకర్ బాబు, వడ్లకొండ అనిల్, బుర్ర సతీష్, పొద్దుపొడుపు శంకర్, మాంకాల ప్రసాద్, మల్లిక్ తేజ,పాత శ్రీధర్,
గణ శ్యామ్, బుర్ర నటరాజ్, ఓరుగంటి శేఖర్, కోడం సంతోష్, తేలు విజయ, వినోద్, విజువల్ శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బిఆర్.ఆర్.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి మరియు గొల్లపల్లి ఆంజనేయులు కళాకారులను శాలువలు మేమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.