జనం న్యూస్ మే 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
తెలంగాణ అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నరసింహ,అదనపు కలెక్టర్ పి రాంబాబు లతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులతో రాష్ట్ర అవతరణ దినోత్సవం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు వివరాలు 29వ తారీకు లోపు సిపిఓ కి అందజేయాలని సూచించారు.ప్రముఖులకు ఆహ్వానం, ప్రోటోకాల్,సీట్టింగ్ అరేంజ్మెంట్, స్వతంత్ర సమర యోధులకి సన్మానం లాంటి వాటిల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు దేశ భక్తికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవిగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. డ్రింకింగ్ వాటర్ సూర్యాపేట మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేడుకలు జరిగే చోట హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ క్యాంపు కంప్లైంట్స్, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాజీవ్ యువ వికాసం,ఇందిరా మహిళా శక్తి,ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలకు సంబంధించిన ఉత్తర్వులు లబ్ధిదారులకు జూన్ రెండో తారీఖున అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్, డివిజన్ కార్యాలయాలు,మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు లాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో జరిపేలా చూడాలని అధికారులకు సూచించారు. స్టాల్స్ లను శాఖల వారీగా ఏర్పాటు చేస్తూ తమ శాఖచే చేసిన కార్యక్రమాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చూపించాలని తెలిపారు.తదుపరి జిల్లా ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ వర్షాకాలం కాబట్టి పరేడ్ గ్రౌండ్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్లాగ్ అఫ్ ఆనర్ లకి సంబందించి అన్ని ఏర్పాట్లు చూడాలని అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డికి సూచించారు.ఈ సమావేశంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఓ వివి అప్పారావు, ఆర్డిఓ వేణుమాధవ్ సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిపిఓ కిషన్, డి ఈ ఓ అశోక్,డిపిఓ యాదగిరి, డి ఐ ఈ ఓ భాను నాయక్,సంక్షేమ అధికారులు దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, శంకర్,జగదీశ్వర్ రెడ్డి, పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.