4 కోట్ల విలువ చేసే నిషేదిత గంజాయి సీజ్.
పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజ్.
జనం న్యూస్,మే28,జూలూరుపాడు:
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో జులూరుపాడు పోలీసులు మరియు సి సి ఎస్ పోలీసులు సంయుక్తంగా పడమట నర్సాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీలో HR55AH7375 అను నంబరు గల ఐచర్ వ్యాస్ ను ఆపి తనిఖీ చేయగా నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జూలూరుపాడు పోలీసులు మరియు సి సి ఎస్ పోలీసులు తనిఖీలో భాగంగా పడమట నరసాపురం గ్రామ సమీపం వద్ద ఐచర్ వ్యాను లో కిలో 830.540 గ్రాములు ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది.పట్టుపడి నిషేధిత గంజాయి విలువ సుమారుగా రూ. 4,15,27,000/-,పట్టుబడిన గంజాయిని విలీసులు స్వాదీనం చేసుకోవడం జరిగింది,ఐచర్ వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఐచర్ వ్యాను ఇంజన్ వెనుక భాగంలో అనుమానం రాకుండా ఒక ప్రత్యేకమైన షటర్ ను తయారు చేసి అందులో గంజాయిని ప్యాకెట్ల బస్తాలలో భద్రపరిచారు.పట్టుబడిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా,మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు. .పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు ఎ1). బస్రామ్,తండ్రి:పూల్ సింగ్, వృత్తి: డ్రైవర్, నివాసము: బాసినైకపుర, హతద్ కరి, టెండ్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం.ఎ2).రామ్ కుమార్,తండ్రి: చెదలాల్,వృత్తి డ్రైవర్,నివాసం: బర్ల గ్రామం, టెండ్ వల్లా,మధ్యప్రదేశ్. నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణాకు ఉపయోగించిన ఐచర్ వ్యాన్ ను మరియు రెండు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగినది తెలిపారు కొనుగోలు చేసిన, అమ్మిన వ్యక్తులు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ నిషేధత గంజాయి అక్రమ రవాణాను జిల్లా పోలీసులు సమర్ధవంతంగా అడ్డుకోవడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో 112 కేసులలో 8078 కేజీలు, 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 3002 కిలోల నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ రోజు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్జుకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందిత గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు సిఐ ఇంద్ర సినారెడ్డి, ఎస్సై రవి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్, మరియు సిబ్బందిని ఎస్పీ రోహితి రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.నిషేధిత గంజాయి అమ్మితు పట్టుబడిన వారి నుండి నిషేధిత గంజాయి అమ్మి అక్రమంగా సొమ్ములు సంపాదించిన ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీన పరిచేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిషేధిత గంజాయి,చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు ప్రజలుకు,విద్యార్థులకు,యువతకు అవగాహన కార్యక్రమాలు పోలీస్ శాఖ నుండి చేపడుతునట్లు తెలిపారు.