నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాలు వస్తే అధికారుల దృష్ఠికి తీసుకురావాలని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
జనం న్యూస్ మే 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
నకిలీ విత్తనాలు,పురుగుల మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మునగాల మంటల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో విత్తనాలను మండల వ్యవసాయ అధికారి రాజు,మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్,బిల్ బుక్కులతో పాటు తదితర రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..సీడ్స్ , ఫర్టిలైజర్ దుకాణాదారులు నకిలీ విత్తనాలు,పురుగుల మందు అమ్మవద్దని అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులను ఎలాంటి విషయంలో మోసం చేసిన యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారుల సలహా సూచనల ప్రకారం విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి అని డీలర్లకు సూచించారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అట్టి వారిపై నేరుగా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని కష్టపడి పనిచేసే రైతుకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లదే అన్నారు.