జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి.
రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పునరాలోచన చేయాలి.
బి.శ్రీను నాయక్.
తెనాలిలో ఐత నగర్ లో పలు కేసుల్లో ముద్దాయిలు, నేల ప్రవర్తన కలిగిన యువకులు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు.సంఘటనను దృష్టిలో పెట్టుకొని యువకులను రోడ్డుమీదకి తీసుకొచ్చి సీఐ రాములు నాయక్, రమేష్ బాబులు కొట్టడం జరిగింది. ఆ యువకుల పట్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారు చేస్తున్నటువంటి కొన్ని పనుల వలన భయభ్రాంతుకు లోనే ఉన్నారు. కాబట్టి సిఐలు ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించడం కోసం రోడ్డు మీదకు తీసుకువచ్చి కొట్టడం జరిగింది. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు కులాన్ని ఆపాదించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కులం పేరుతో తిట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చూస్తున్నారని, వారి ఆలోచన విధానానికి పరాకాష్టకు నిదర్శనం గా తెలుస్తుందన్నారు. వాస్తవాలు… అవాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నేర ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తుల కోసం మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులను శిక్షించడం తప్పు ఎలా అవుతుందని, మానవతా దృక్పథంలో ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజంలో అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అంటే వారు చేస్తున్నటువంటి నేరను ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని ఐతనగర్లో నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని నాయక్ డిమాండ్ చేశారు.