జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి తెలంగాణ రాష్ట్ర స్థాయి లో అన్ని ప్రభుత్వ పాఠశాల లో జరిగే నూతన అభ్యసన ప్రక్రియ గుర్తించి,, జూన్ మాసం లో రాష్ట్ర స్థాయి లో జరిగే ప్రదర్శనకు , ఈనెల 24 వ తేదీన సిద్దిపేట జిల్లా లో కలెక్టర్ సూచన మేరకు ఏర్పాటు అయిన కమిటీ అధ్యక్షులు,జిల్లా విద్యాశాఖాధికారి ఈ శ్రీనివాస రెడ్డి, సెక్టోరియల్ అధికారి భాస్కర్, ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు వై చిన్న బ్రహ్మయ్య , తన బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా చేస్తున్న వివిధ వినూతన , బోధన ప్రక్రియలు, అన్ని భావనల కు సంబంధించిన గురువు స్లాట్ మేజిక్ ప్రక్రియలతో పాటు ఆద్వర్యంలో పాఠశాల విద్యార్థులు సాధిస్తూన్న అంతర్జాతీయ.జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు పరంపర మీద ఇచ్చిన ప్రదర్శన జిల్లా స్థాయినుండి రాష్ట్ర స్థాయి కి ఎంపిక కాబడినది.దీనిని జూన్ మాసం లో మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల భవనం లో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన జరుగును.దీనిపట్ల మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు అయిన వెంకట రాములు,ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు బాల్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు….