జనం న్యూస్ మే 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:
బట్టాపూర్గ్రామములో బుధవారం రోజునా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలే శ్రీనివాస్, షేక్ కరీం లబ్ది దారులతో కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించి, ముగ్గు పోసారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని రాకముందే మా నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారం లోనికి రాగానే ఇండ్లు లేని పేదవారికి తప్పకుండ ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇచ్చి తిరుతాం అన్న మాటకు నేడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా ప్రతి ఒక్కరు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నాయక్, గంగాధర్,తదితరులు, పాల్గొన్నారు.