జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము మాట్లాడుతూ. విద్యా హక్కు చట్టం పాఠశాలలో పుస్తకాలు విక్రయించడం గాని పుస్తకాల పైన పాఠశాలల పేర్లు ప్రింట్ చేయడం గానీ జరగకూడదని చెప్తున్నప్పటికీ నారాయణ పాఠశాలలో విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాల దగ్గర నుండి యూనిఫార్మ్స్ బెల్టులు వరకు వ్యాపారం జరుగుతుంది. మరోవైపు విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పాఠశాలల ప్రారంభం కాకపోయినా ముందుగానే పుస్తకాలు అమ్ముతున్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం చూసి చూడనట్టు విడిచి పెడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పుస్తకాలు, యూనిఫార్మ్స్ విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వి. చిన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. సోమేష్, ఆర్. శిరీష, పట్టణ అధ్యక్షులు సూరిబాబు, నాయకులు గౌరీ, గుణ, లక్ష్మీ పాల్గొన్నారు